Friday, April 26, 2024

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ పూర్తి – వచ్చే వారంలో ఫైనల్ రిపోర్ట్

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్​ సమీపంలో సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ సహా​ మరో 13 మంది దుర్మరణానికి కారణమైన ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాద ఘటనపై (CSD Bipin Rawat Helicopter Crash) ఎంక్వైరీ పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐఏఎఫ్​, ఆర్మీ, నేవీకి చెందిన అధికారులు ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. కాగా, వచ్చే వారమే ఘటనకు సంబంధించిన నివేదికను వైమానిక దళానికి (ఐఏఎఫ్) సమర్పించనున్నట్లు (IAF report on Helicopter Crash) సమాచారం.

ఎయిర్ మార్షల్​ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ‘‘మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? వాతావరణం అనుకూలించలేదా?’’ అనే విషయాలతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినట్లు తెలిసింది. ల్యాండింగ్ సమయంలో సిబ్బంది అయోమయ స్థితిలో ఉన్నారా అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు బృందంలో ఎయిర్​ మార్షల్ మానవేంద్ర సింగ్​తో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు దర్యాప్తులో పాల్గొని నివేదికను రూపొందించారు.

ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ విచారణకు సంబంధించి ఓ అధికారి కీలక ప్రకటన కూడా చేశారు. అన్ని నిబంధనలకు లోబడే ఈ విచారణ జరిగిందనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు చట్టపరమైన పరిశీలన జరగుతున్నట్లు వివరించారు. అయితే విచారణకు సంబంధించి ఇప్పటి వరకు త్రివిధ దళాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement