Tuesday, April 23, 2024

ఆర్మీ హెలికాఫ్టర్ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి మృత‌దేహాలు .. రేపు ఢిల్లీకి త‌ర‌లింపు ..

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో 14మంది మృతి చెందారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ దంప‌తులు కూడా మ‌ర‌ణించారు. వారితో పాటు ప‌లువురు సైనికాధికారులు మృతి చెందారు. కాగా వీరి మృత‌దేహాల‌ను రేపు ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. గురువారం సాయంత్రానికి వీరి భౌతికకాయాలు దేశ రాజధానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతం రావత్ సహా అందరి పార్ధివ దేహాలు వెల్లింగ్టన్‌లోని బేస్ క్యాంపులోనే వున్నాయి. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలింది.ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement