Thursday, April 25, 2024

జనసేన పార్టీలో చేరిన ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఆయన ఆర్టీసీ ఈడీగా పదవీ విరమణ చేశారు. హైదరాబాదులోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వెంకటేశ్వరరావు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు నాదెండ్ల మనోహర్ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజాపక్షంగా ఉన్నాయని, అందుకే జనసేనలో చేరాలన్న నిర్ణయం తీసుకున్నానని వెంకటేశ్వరరావు వెల్లడించారు. జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement