Thursday, March 28, 2024

Breaking: కనకదుర్గమ్మ గుడిలో అపచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది. సెక్యూరిటీ లోపంతో సినీ నటుడు రామ్ చరణ్ అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయంలో మొబైల్ ఫోన్లతో అభిమానులు వీడియోలు తీశారు. అభిమానుల తాకిడితో ఆలయం లోపల రైలింగ్ రాడ్లు విరిగిపోయాయి. పోలీసులు, దుర్గ గుడి అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా గందరగోళం నెలకొంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement