Saturday, April 20, 2024

AP Govt: సాయితేజకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఏపీకి చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వీర జ‌వాన్ సాయితేజ కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. సాయి తేజ కుటుంబానికి.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

సాయితేజ సభ్యులను ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్‌ను సాయి తేజ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

మరోవైపు శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం సాయితేజ ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలానికి భౌతికకాయాన్ని తరలించారు.

కాగా, డిసెంబర్‌ 8న తమిళనాడులోని కూనూర్‌ వద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ దంపతులతో పాటు 13 మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement