Saturday, April 20, 2024

ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పిల్లల పేరు మీద రూ.10 లక్షల ఎఫ్‌డీ

ఏపీలో కరోనా బారిన పడి మరణించిన తల్లిదండ్రుల పిల్లలను కాపాడేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరుపై రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారికి 25ఏళ్లు వచ్చేవరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఉండనుంది. ఈ రూ.10లక్షలపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నారు. ఈ పిల్లలంతా వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని అధికారులకు జగన్ గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement