Thursday, April 18, 2024

40 అంశాల అజెండాతో ఇవాళ ఏపీ కేబినెట్ మీట్..

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్‌ సమావేశం జరగనుంది.. 40 అంశాల అజెండాతో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్న మంత్రి వర్గం.. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు చేయనుంది.. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చజరగనుండగా.. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ తరహా అథారిటీలు ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఆర్గానిక్ ఫాంగా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానున్నారు.

ఇక, ఆసరా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.. గృహలు మంజూరైన లబ్ధిదారులకు రూ.35 వేల అదనపు రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనపై చర్చించనుంది కేబినెట్.. పాఠశాలలు, ఆస్పత్రుల పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే దాతల పేర్లను పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.. విశాఖలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదన పై కేబినెట్‌లో చర్చ సాగనుంది.. బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం లభించడనుండగా.. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినట్‌ చర్చించనుంది.. ఇక, హోంగార్డుల నియామకంపై చర్చసాగనుండగా.. ఇలా మొత్తం 40 అంశాలతో కేబినెట్‌ అజెండా రూపొందించారు అధికారులు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement