Friday, April 26, 2024

న‌దిలో కొత్త జంట స‌ర‌సాలు – భ‌ర్త‌ని చిత‌క‌బాదిన భ‌క్తులు

భ‌క్తులు ప‌విత్రంగా భావించే అయోధ్య‌లోని స‌ర‌యూ న‌దిలో ఓ కొత్త జంట‌కి చేదు అనుభ‌వం జ‌రిగింది.ఈ న‌దిలో భ‌క్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అదే సమయంలో ఓ జంట స్నానం కోసం నదిలోకి దిగింది. అయితే.. వారికి ఏమైందో ఏమో కానీ, వారు ఎక్క‌డ ఉన్నారో మరిచిపోయారు. ఆ న‌దినే స్మిమింగ్ పూల్ గా భావించారు.. అంద‌రూ చూస్తుండగానే ఆ జంట‌ లిప్ టు లిప్ కిస్ చేసుకుంటూ రెచ్చిపోయారు. వారి శృతి మించిన వ్య‌వ‌హ‌రాన్ని చూసిన చుట్టుపక్కల భ‌క్తుల‌కు పిచ్చ కోపం వచ్చింది. ఆ దంపతులపై మండిపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భార్య ముందే భర్తకు నాలుగు తగిలించారు. పవిత్రమైన ప్రదేశంలో ముద్దులాడుకుంటారా అంటూ భార్య ఎదుటే.. భర్త చెంపలు వాయించారు.

దీంతో ఆ జంట షాక్ గురైంది. ఆ భార్య వారిని ఎంత బతిమిలాడినా జనాలు మాత్రం భర్తను విడిచిపెట్టకుండా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయోధ్యలో రాముడి పాదాలపై సరయూ నదిలో స్నానం చేస్తున్న భార్యాభర్తలపై కొందరు దాడి చేసి భర్తను దారుణంగా కొట్టి దుర్భాషలాడారు. అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరయూ నది ఒడ్డున ఈ ఘటన జరిగిందని, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. దాడి చేసిన నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement