Friday, April 19, 2024

మరో పది రైళ్ల సేవలు ప్రారంభం..

కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి రావడంతో రోజువారి ప్రయాణాలు పెరుగుతున్నాయి. దీంతో రైల్వే శాఖ రైళ్ల పునరుద్దరనను ప్రారంభించింది. లాక్‌డౌన్ కారణంగా గతంలో రద్దు చేసిన పది రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అలాగే, మరో 8 రైళ్ల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొంది. పట్టాలెక్కనున్న రైళ్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, ఆదిలాబాద్ నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్-ఆదిలాబాద్ (01142) రైలు గురువారం పట్టాలెక్కనుండగా, ఆదిలాబాద్- ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ (01141) రైలు జులై 2 నుంచి సేవలు ప్రారంభించనుంది. పూణె-కాజీపేట (01251) రైలు జులై 9 నుంచి, కాజీపేట-పూణె (01252) రైలు 11వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.

సికింద్రాబాద్-రక్సౌల్ (07026), రక్సౌల్-సికింద్రాబాద్ (07025), హైదరాబాద్-గోరఖ్‌పూర్ (02575), గోరఖ్‌పూర్-హైదరాబాద్ (02576), షాలిమార్-సికింద్రాబాద్ (02449), సికింద్రాబాద్-షాలిమార్ (02450) రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. కాగా, హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను 12  నుంచి 57కు పెంచినందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement