Friday, April 19, 2024

BIG BREAKING : వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై మళ్లీ రాళ్ల దాడి

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి జరిగింది. ఈ సంఘటన ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు. రైల్వే అధికారులు ధ్వంసమైన గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చారు. దీంతో ఆలస్యంగా బయలుదేరింది ఈ వందే భారత్ ట్రైన్. మూడు గంటల లేటు గా విశాఖ – సికింద్రాబాద్ ట్రైన్ పయనం కానుంది. అయితే గతంలో కూడా వందే భారత్ ట్రైన్ పై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement