Thursday, March 28, 2024

కాలిఫోర్నియాలో మ‌రోసారి కాల్పులు.. ఏడుగురు మృతి

కాలిఫోర్నియాలో మ‌రోసారి కాల్పుల ఘ‌ట‌న ఉలిక్కిప‌డేలా చేసింది. హాప్ మూన్ బే’ పట్టణంలో జరిగిన కాల్పుల ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో రెండోసారి కాల్పలు జరగడం గమనార్హం. ఈ కాల్పుల్లో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అనుమానితుడిని 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీగా గుర్తించారు. తోటి వర్కర్లపై కాల్పులు జరిపిన అనంతరం జావో అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్నాడని, మరేం భయం లేదని శాన్ మేటో కౌంటీ పోలీసులు తెలిపారు. హాఫ్ మూన్ బే సబ్‌స్టేషన్‌లోని పార్కింగ్ ప్లేస్‌లో తన వాహనంలో ఉండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడి కారులో ఎలాంటి ఆయుధం దొరకలేదని పేర్కొన్నారు. కాల్పులు సరిగ్గా ఎక్కడ జరిగాయన్న విషయం కానీ, కాల్పులకు గల స్పష్టమైన కారణం కానీ తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement