Wednesday, April 24, 2024

టీటీడీలో మరో వివాదం

టీటీడీలో మరో వివాదం చెలరేగింది. తనకు అన్యాయం జరిగిందంటూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా.. తమ కుటుంబం నుంచే రమణదీక్షితులును ప్రధాన అర్చకుడిగా ఏపీ సర్కారు నియమించడాన్ని వేణుగోపాల దీక్షితులు హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులును పేర్కొన్నారు. కాగా ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులుకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement