Friday, March 29, 2024

Breaking: గుండెపోటుతో మరొకరు మృతి

ఇటీవ‌ల కాలంలో గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. ఈ ఉద‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట మండ‌లం ప‌సుమ‌ర్రులో షేక్ ఫిరోజ్ (17) అనే ఇంట‌ర్ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలో గుండెపోటుతో మ‌రొక‌రు మృతిచెందారు. కుమ్మ‌రి బుచ్చి రాములు (38) అనే వ్య‌క్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఖ‌మ్మం జిల్లాలోని నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం రాజేశ్వ‌ర‌పురంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement