Friday, March 29, 2024

Breaking: అన్నారం వెళ్లి వ‌స్తుంటే యాక్సిడెంట్​.. బావిలో పడ్డ కారు, న‌లుగురు మృతి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కారు యాక్సిడెంట్​ జరిగింది. ప్రమాదవాశాత్తు కారు బావిలో పడడంతో న‌లుగురు చనిపోయారు. మరో ఇద్దరు కారులోనే చిక్కుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. తొలుత ఒక‌రు కారులోనే చ‌నిపోగా.. ముగ్గురు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంటే హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత మ‌రో ముగ్గురు చ‌నిపోయిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు వరంగల్‌ జిల్లా పర్వతగిరి దగ్గరున్న అన్నారం షరీఫ్ కు కారులో వెళ్లారు. ఈ క్రమంలో మరో ఇద్దరు లిఫ్ట్‌ అడిగి కారులో ఎక్కారు. ఏడుగురుతో వస్తున్న కారు జిల్లాలోని కే సముద్రం బైపాస్‌ వద్ద అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగా. ఒకరు చనిపోయారు. మరొకరు అపస్మారక స్థితిలో ఉండగా.. చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement