Friday, April 19, 2024

అంకితా భండారీ హ‌త్య కేసులో.. పుల‌కిత్ స‌హా ముగ్గురు నిందితుల‌కు నార్కో ప‌రీక్ష‌లు

అంకితా భండారీ హ‌త్య కేసులో పుల‌కిత్ స‌హా ముగ్గురు నిందితుల‌కు నార్కో ప‌రీక్ష‌ల‌ను చేయ‌నున్నారు. ఉత్తరాఖండ్ లో రిసార్టు రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్య కేసు ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు, రిసార్టు యజమాని పులకిత్ ఆర్య భారతీయ జనతా పార్టీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు కావడంతో రాజకీయ దుమారం కూడా రేగింది. ఈ కేసులో పులకిత్ ఆర్యాతోపాటు అతని స్నేహితులు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని దర్యాప్తు బృందం కోర్టులో దరఖాస్తు చేసింది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీరికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నార్కో పరీక్షల అనంతరమే దర్యాప్తు బృందం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. సాక్ష్యాధారాలను పటిష్టం చేసేందుకు, నిందితులను కఠినంగా శిక్షించేందుకు నార్కో పరీక్షలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement