Friday, March 29, 2024

ఎందుకిలా జరుగుతోంది?

రెండు రోజులుగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో ఫిర్యాదులు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్21, గెలాక్సీ ఏ50, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఏ71, నోట్ 20 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు గూగుల్ పిక్సెల్, మోటోరోలా, హువావే లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లలోనూ ఇదే సమస్య ఉంది. వెబ్ కంటెంట్‌ను డిస్‌ప్లే చేయడానికి ఉపయోగపడే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూలో సమస్య ఉండటం కారణంగా యాప్స్ క్రాష్ అవుతున్నాయి. జీమెయిల్, గూగుల్ లాంటి గూగుల్ యాప్స్ మాత్రమే కాదు అమెజాన్ లాంటి ఇతర యాప్స్ కూడా క్రాష్ అవుతున్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

యాప్స్ క్రాష్ అవడంపై గూగుల్ దృష్టి పెట్టింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. గూగుల్ అప్‌డేట్ రిలీజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతలోపు యూజర్లు వెబ్‌వ్యూ అప్‌డేట్‌ను తొలగించి స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ చేస్తే చాలు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇందుకోసం యూజర్లు ముందుగా తమ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యాప్స్ ఓపెన్ చేయాలి. యాప్స్ లిస్ట్‌లో కిందకు స్క్రోల్ చేస్తే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ‘Uninstall Updates’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే లేటెస్ట్ అప్‌డేట్ అన్‌ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను ఓసారి రీస్టార్ట్ చేయాలి. ఇలా అప్‌డేట్స్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్ అన్‌ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్స్ క్రాష్ కావు. గూగుల్ ఈ సమస్యను గుర్తించి అప్‌డేట్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ యాప్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement