Saturday, April 20, 2024

Covid-19: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నిన్నటితో పొల్చితే స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 30,859 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 160 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కరోనాతో కృష్ణాలో ఒక్కరు మృతి చెందారు. అదే సమయంలో 201 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,74,868కి చేరింది. ఇందులో 20,58,490 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 14,466 మంది కరోనాతో మృతి చెందారు.

మరోవైపు ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఐర్లాండ్‌ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి ఐర్లాండ్‌ నుంచి ముంబైకి చేరుకున్నాడని, అక్కడ ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకున్నాడ‌ని అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే ఆ స‌మ‌యంలో ఆయనకు నెగిటివ్ అని తేలింద‌ని, విజయనగరంలో మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని వివ‌రించారు.  అతడి శాంపిళ్లను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించ‌గా ఒమిక్రాన్ గా నిర్ధార‌ణ అయింద‌ని స్ప‌ష్టం చేశారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement