Friday, April 26, 2024

పీవీ సింధుకు రెండు ఎకరాల భూమి కేటాయించిన ఏపీ సర్కారు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం విశాఖ నగరంలోని తోటగరువులో రెండు ఎకరాల స్థలం కేటాయించింది. దీనికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. దీని ప్రకారం విశాఖ రూరల్‌ (చినగదిలి) మండల పరిధిలో 73/11, 83/5,6 సర్వే నంబర్లలో 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు తహసీల్దార్ ఆర్‌.నర్సింహమూర్తి తెలిపారు.

కాగా ఈ స్థలానికి మండల సర్వేయర్‌తో ఇప్పటికే సర్వే నిర్వహించామని తహసీల్దార్ చెప్పారు. పీవీ సింధు నెలకొల్పే అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో స్థలం కేటాయించడం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ ఏర్పాటుతో నగరం నుంచి క్రీడాకారులు తయారయ్యేందుకు మంచి అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఆగస్టు నెల టీటీడీ టిక్కెట్లు విడుదల.. మొరాయించిన సర్వ

Advertisement

తాజా వార్తలు

Advertisement