Tuesday, April 16, 2024

ఏపీలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 2,331 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తక్కువ టెస్టులు చేస్తున్నా కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,812 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,331 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202, నెల్లూరు జిల్లాలో 186, కర్నూలు జిల్లాలో 176, కడప జిల్లాలో 149, శ్రీకాకుళం జిల్లాలో 123, ప్రకాశం జిల్లాలో 110, విజయనగరం జిల్లాలో 47, తూ.గో. జిల్లాలో 29, ప.గో. జిల్లాలో 20 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 853 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, తూ.గో., కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,13,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,92,736 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 13,276గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,262గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement