Tuesday, April 23, 2024

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,57, 562కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7258 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,256కి చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 994 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,36, 048 లక్షలకు చేరింది. ఇక ఆదివారం ఒక్క రోజే ఏపీలో 23, 022 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 87, 67 , 963 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement