Wednesday, April 24, 2024

ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు లేదు

ఏపీలో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విస్తరిస్తోంది. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలోని ఓ ఊరిలో ఒక్క కరోనా కేసు లేదు. పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లిలో స్థానికులుఊరి నుంచి కాలు బయట పెట్టకుండా హాయిగా ఉంటున్నారు. చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సాతార్లపల్లి, గంగిరెడ్డిపల్లి, దిగువ చెర్లోపల్లిలో కరోనా మొదటి, రెండో దశలోనూ ఒక్క కేసూ నమోదు కాకపోవడం విశేషం.

ఈ గ్రామంలో 2వేలమంది జనాభా ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఏ సమస్య వచ్చినా స్థానికంగానే పరిష్కరించుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామానికి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పట్టణాలకు వెళ్లడం లేదు. అందువల్లే వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు. విద్యార్థులకు స్కూళ్లు స్థానికంగానే అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు ఈ గ్రామంలో పంటలు కూడా పేడ, ఆకులతో తయారైన ఎరువులనే పంటలకు ఉపయోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం బాగా తక్కువ. వీరంతా తాము పండించిన పంటలనే తినేందుకు వినియోగిస్తున్నారు. చికెన్‌ తినాలన్నా.. తాము సొంతంగా పెంచుకున్న నాటు కోళ్లనే వినియోగిస్తున్నారు. వేరుశనగ, కంది, వరి, మొక్కజొన్న, తీగ జాతి కూరగాయ పంటల్ని అధికంగా సాగు చేస్తున్నారు. అక్కడి రైతులకు దేశవాళీ ఆవులు, గేదెలు, ఎద్దులున్నాయి. దీంతో స్థానికంగా దొరికే వాటితోనే భోజనం సిద్ధం చేసుకుంటామని.. అందువల్లే వైరస్‌ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినా స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement