Friday, April 19, 2024

పోలీసుల‌కి చిక్కిన‌ట్టే చిక్కి ప‌రారైన.. అమృత్ పాల్ సింగ్

పోలీసుల‌కి చిక్కిన‌ట్టే చిక్కి చివ‌రిక్ష‌ణంలో త‌ప్పించుకుపారిపోయాడు ఖలిస్థానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ .. జలంధర్ లో శనివారం సాయంత్రం అమృత్ పాల్ ఓ ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్లడం చూశామని స్థానికులు చెబుతున్నారు. అయితే, పోలీసులు దీనిని నిర్ధారించలేదు.కాగా ఆయ‌న పరారీలో ఉన్నాడని పంజాబ్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. అమృత్ పాల్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు చెప్పారు. అమృత్ పాల్ సింగ్ గన్ మెన్లు ఆరుగురితో పాటు వారిస్ పంజాబ్ దే సంస్థకు చెందిన 78 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ ఛాహల్ మీడియాకు వెల్లడించారు.

ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే దల్జీత్ సింగ్ ఖల్సిని గుర్గావ్ లో అరెస్టు చేశామని వివరించారు. ఏడు జిల్లాల పోలీసులతో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అమృత్ పాల్ ను అరెస్టు చేయడానికి శనివారం భారీ ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. చివరి క్షణంలో అమృత్ పాల్ మోటార్ సైకిల్ పై పారిపోయాడని వివరించారు. అమృత్ పాల్ ను పట్టుకోవడానికి వేట మొదలెట్టామని, అమృత్ సొంతూరు జల్లూపూర్ ఖైరాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సీపీ కుల్దీప్ సింగ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement