Tuesday, April 16, 2024

జాతీయ‌జెండాని ఎగ‌రవేసిన – అమిత్ షా దంప‌తులు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హ‌ర్ గ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మంలో భాగంగా త‌మ నివాసంపై త‌న భార్య‌తో క‌లిసి జాతీయ‌జెండాని ఎగ‌ర‌వేసి ఆ ఫొటోని ట్వీట్ చేశారు. మూడు రంగుల జెండా మన గౌరవం. ప్రతి భారతీయుడిని ఇది ఒక్కటి చేస్తుంది. స్ఫూర్తిని నింపుతుంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఢిల్లీలోని మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశాం. మాతృభూమి కోసం త్యాగాలు చేసినవారికి ఘనంగా నివాళులు అర్పించాం అని అమిత్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బెంగళూరులోని తన నివాసంపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఇంకా కేంద్ర మంత్రులు జైశకంర్, నితిన్ గడ్కరీ, హర్ దీప్ సింగ్ పూరి తదితరులు కూడా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. హర్‌ ఘర్ తిరంగా ఉత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement