Saturday, April 20, 2024

కేసిఆర్ పై యుద్ధమే.. అమీతుమీకి సిద్ధం కండి: బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపు

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ శ్రేణులకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలని, కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

హుజూరాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయభేరి మోగించాలని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి… ప్రభుత్వ పరంగా ఏంచేయాలో మాకు వదిలేయండి అని ఉద్బోధించారు. ఇకపై తెలంగాణలో తరచుగా పర్యటిస్తానని అమిత్ షా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement