Tuesday, April 23, 2024

నడ్డా వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేటీఆర్..

మహబూబ్‌నగర్‌ సభలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను మంత్రి కేటీఆర్‌ తిప్పికొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని, 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లోనే వంట గ్యాస్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని భాజపా నేతలు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కేటీఆర్‌ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement