Saturday, April 20, 2024

అమ‌రావ‌తి ఏపీ రాష్ట్ర రాజ‌ధాని..సోమూ వీర్రాజు

అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్ఘాటించారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని వివరించారు. నెల్లూరు జిల్లా కావ‌లి వ‌ద్ద అమ‌రావ‌తి రైతుల ఆధ్వ‌ర్యంలో బిజెపి భారీ స‌భ చేప‌ట్టింది. ఈ సభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement