Thursday, March 28, 2024

సీఎం జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం

తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. స్వార్థపరుల వల్ల అమరారెడ్డినగర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించిన కూడా అధికారులు పట్టించుకోలేదని అందులో ఆరోపించారు. నిజమైన నిర్వాసితులకు అన్యాయం జరిగిందని.. తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపిస్తూ ఫ్లెక్సీ పెట్టారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపించారు. స్వార్థపరుల వల్ల అమరారెడ్డినగర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు చర్చిలను నేలకులుస్తున్నారని కనీసం చర్చిల కైనా స్థలం కేటాయించాలని పాస్టర్లు కోరుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌, నాయకులకు విజ్ఞప్తి చేశారు. సీఎం భద్రత చర్యల్లో భాగంగా రహదారి విస్తరణ కోసం తాడేపల్లిలోని అమరారెడ్డి నగర్ వాసుల వాసులు గృహాలను ఖాళీచేయించారు. వీరికి పరిహారం కింద ఆత్మకూరు సమీపంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ అంశంపై చాలా రోజులుగా బాధితులు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

గత నెలలోనూ బాధితులు సీఎం నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం గృహాలు కట్టించి నష్టపరిహారం చెల్లించిన తరువాత మాత్రమే ఇల్లు ఖాళీ చేస్తామని అంటున్నారు. నష్ట పరిహారం చెల్లించకుండా ఇల్లు ఖాళీ చేయమని దారుణమని మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇళ్లు ఖాళీ చేయమనడం సరికాదంటూ నిరసన తెలపగా వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి: విజయవాడ, సాగర్‌లలో వాటర్ ఏరో డ్రమ్‌లు

Advertisement

తాజా వార్తలు

Advertisement