Saturday, April 20, 2024

ఏపీలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో పాఠశాల దశ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లీష్ బోధనపై ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌ ఆదేశాలతో ఇంగ్లీష్ మాధ్యమాన్ని అమల్లోకి తెస్తున్నట్టు వెల్లడించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు  మీడియం కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement