Thursday, March 28, 2024

ఏకేరావుది ఆత్మ‌హ‌త్యే .. తేల్చిన పోలీసులు ..

సుజ‌నా పౌండేష‌న్ సీఈఓగా ప‌ని చేస్తున్న ఏకే రావుది ఆత్మ‌హ‌త్యేన‌ని తేల్చారు. నవంబ‌ర్ 25న ఏకే రావు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. బెంగ‌ళూరులోని రైల్వే ట్రాక్ పై ఆయ‌న మృత‌దేహం ల‌భించింది. మృత‌దేహంపూ ఉన్న గాయాల ఆధారంగా ఏకే రావు మ‌ర‌ణంపై అనుమానం వ్య‌క్తం చేశారు పోలీసులు. పోస్టు మార్టం రిపోర్ట్ తో ఆయ‌న‌తి ఆత్మ‌హ‌త్యేన‌ని తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో 174 సీఆర్‌పీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చివరకు ఏకే రావుది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. రైల్వే ట్రాక్ పై పడడంతో శరీరంపై గాయాలైనట్టుగా పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement