Sunday, April 14, 2024

గాల్లో విమానం.. చెల‌రేగిన మంట‌లు.. సుర‌క్షితంగా ల్యాండింగ్

గాల్లో విమానం ఉండ‌గా ఇంజిన్ లో మంట‌లు చెల‌రేగాయి.. దాంతో అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించి సుర‌క్షితంగా ల్యాండ్ చేశాడు. దాంతో ప్ర‌యాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్‌ (కేరళ, కోజికోడ్‌)కు బయలుదేరింది. టేకాఫ్‌ అయి విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ వెంటనే విమానాన్ని తిరిగి అబుదాబి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement