Saturday, April 20, 2024

Flash: పాతబస్తీ అర్ధరాత్రి MIM కార్పొరేటర్ హంగామా.. పవర్ నడవదంటూ ఎస్ఐకి వార్నింగ్

హైదరాబాద్‌ భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా బెదిరింపులు, అరెస్టు ఘటన మరవకముందే పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ రెచ్చిపోయాడు. పాతబస్తీలో పోలీసులపై ఓ కార్పొరేటర్ మండిపడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. పాతబస్తీలోని మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో కార్పొరేటర్ సయ్యద్ సొహైల్‌ ఖాద్రీ.. వాహనాల పార్కింగ్‌ కోసం యునాని హాస్పిటల్‌ గేట్లు తెరిపించాడు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అక్కడికి పోలీసులు రావడంతో కార్పొరేటర్ సొహైల్ ఖాద్రీ కోపంతో ఊగిపోయాడు. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ ఎస్‌ఐపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా ఇక్కడ ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ వస్తే వచ్చామని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోలేదు. పోలీసులకు యునాని హాస్పిటల్‌ సిబ్బంది ఫోన్‌ చేశారని తెలిసి వారిపై సీరియస్ అయ్యారు. గట్టి గట్టిగా అరుస్తూ మండిపడ్డాడు. పోలీసు పవర్‌ చూపిస్తామంటే ఇక్కడ నడవదంటూ ఎస్సైకి వార్నింగ్ ఇచ్చారు. యునాని హాస్పిటల్‌లోనే పార్కింగ్‌ కంటిన్యూ అవుతుందని.. మీరేం చేస్తారో చూస్తామంటూ బెదిరించాడు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement