Thursday, April 18, 2024

ఆరు నెల‌ల త‌ర్వాత.. చైనాలో కోవిడ్ మ‌ర‌ణం

దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత చైనాలో మ‌ళ్లీ ఒక కోవిడ్ మ‌ర‌ణం న‌మోద‌యింది. నేడు అధికారిక ప్ర‌క‌ట‌న‌లో చైనా ఈ విష‌యాన్ని తెలిపింది.కాగా బీజింగ్ కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడిన మరణించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నేడు ప్రకటించింది. మే 26 తర్వాత చైనాలో కరోనా మరణం నమోదవడం ఇదే ప్రథమం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా మృతులసంఖ్య 5,227కి పెరిగింది. చైనాలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరం చేసినప్పటికీ, కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో కనీసం ఒక్క డోసు తీసుకున్నవారు 92 శాతం మంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement