Thursday, March 28, 2024

ఎంబీబీఎస్ ప్రవేశాలకు అదనపు మాప్ ఆఫ్ నోటిఫికేషన్.. 30వ తేదీన వెబ్ ఆప్షన్లు

వరంగల్‌, ప్రభ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఈ నెల 30వ తేదీన వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం అదనపు మాప్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తి అయ్యింది. మాప్ ఆఫ్ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీ వివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 30 వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివ‌ర్సిటీ పేర్కొంది. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు ఈ విడత కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చు. గత విడత కౌన్సెలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయిన చేరి డిస్ కంటిన్యూ చేసినా అదేవిధంగా అల్ ఇండియా కోటా లో ఇప్పటికే చేరినా, అట్టి విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు అనర్హులని యూనివర్సిటీ పేర్కొంది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement