పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరక్కెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటి విడుదలైన పాటలు, టిజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నాలుగో పాటను రిలీజ్ చేశారు. అడవితల్లి మాట అంటూ సాగే పాటను విడుదల చేశారు. పాటలో పవన్, రానాల విజువల్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.