Saturday, April 20, 2024

Adani: మీడియా రంగంలోకి అదానీ.. ఎన్డీటీవీలో 26శాతం వాటా కొనుగోలు!

ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్)లో వాటాల‌ను కొనుగోలు చేశారు బిజినెస్ టైకూన్ అదాని. జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థగా ఎన్డీటీవీ గుర్తింపు పొందింది. ఇప్పుడీ మీడియా సంస్థపై భారత సంపన్నుడు అదానీ కన్నేశారు. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాని కొనుగోలు చేయ‌నున్న‌ట్టు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్ర‌క‌టించాయి. కాగా, 26శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ తాజాగా ప్రతిపాదన చేసింది. 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటి రూ.294 ముఖ విలువతో మొత్తం రూ.492 కోట్లకు కొనుగోలు చేసేందుకు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఈ మేరకు ఎన్డీటీవీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement