Saturday, April 20, 2024

సైకిల్ పై వచ్చి ఓటేసిన విజయ్.. కారణం అదే!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఓటు వేయడానికి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులైన సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వ నటుడు, మ‌క్క‌ల్ నిధి మ‌య్యం చీఫ్ కమల్ హాసన్, అజిత్, సూర్య వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు అభిమానులకు ఓటు వేయమని పిలుపునిచ్చారు.

అయితే,తమిళ స్టార్ హీరో సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్ కు రావడం వచ్చారు. ముఖానికి కరోనా మాస్కు ధరించిన విజయ్ స్పోర్ట్స్ సైకిల్ పై ట్రాఫిక్ లో ప్రయాణిస్తూ చెన్నైలోని నీలంకరై పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దేశంలో పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధరల ధర రూ. 95 పైనే ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధరలు రూ 100 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ… హీరో విజయ్ ఇలా సైకిల్ పై వచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ సైకిల్ పై రావడానికి కారణం పెరిగిన పెట్రో ధరలేనని, అందుకు నిరసనగానే సైకిల్ ఎంచుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బీజేపీ కూటమికి ఓటేయవద్దని పరోక్షంగా చెప్పడానికే ఇలా చేశారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement