Saturday, April 20, 2024

Mystery | నటి తునీషాది ఆత్మహత్యా? హత్యా!?.. లవ్​ జిహాద్​ కారణం అంటున్న బీజేపీ!!

మహారాష్ట్రలో ప్రముఖ నటి తునీషా ఆత్మహత్య ఓ మిస్టరీగా మారింది. ఆమె ఎట్లా చనిపోయింది. అది ఆత్మహత్యనా! లేక హత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్​ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాయి. ఆమె లవ్​ జిహాద్​ కారణంగా చనిపోయిందని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్​ కదమ్​ సీరియస్​ కామెంట్స్​ చేయడం ఇప్పుడు సినీవర్గాల్లో కలకలం రేపుతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మహారాష్ట్రలో ప్రముఖ నటి ఆత్మహత్య ‘లవ్ జిహాద్’ ఫలితమేనని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదివారం అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్‌లో టెలివిజన్ ప్రోగ్రామ్ సెట్‌లోనే తునీషా శర్మ చనిపోయి ఉంది. అలీ బాబా: దస్తాన్-ఇ-కాబూల్  అనే టెలివిజన్ సీరియల్​లో తునీషా సహనటుడు షీజాన్ మహ్మద్ ఖాన్​తో లవ్​లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక.. తునీషా తల్లి ఫిర్యాదు ఆధారంగా షీజాన్ మహ్మద్ ఖాన్ తునీషా ఆత్మహత్యకు కారణమయ్యాడనే కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులోని ఎఫ్‌ఐఆర్‌లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, 15 రోజుల క్రితం విడిపోయారని తెలుస్తోంది. కాగా, ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశోధించేలని, అన్ని రకాల పరీశీలించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామ్ కదమ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

‘‘ఆత్మహత్యకు దారితీసింది ఏమిటి, ఎందుకు? ఇది లవ్ జిహాద్ కేసునా? లేక ఇంకేమైనా సమస్య ఉందా? విచారణలో నిజం బయటపడుతుంది. కానీ, తునీషా శర్మ కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుంది. ఇది లవ్ జిహాద్ కేసు అయితే ఏ సంస్థలు బాధ్యులుగా ఉన్నాయి.. కుట్రదారులు ఎవరో కూడా పోలీసులు పరిశీలిస్తారు ”అని బీజేపీ ఎమ్మెల్యే రామ్​ కదమ్​ అన్నారు. ముంబైలోని వసాయ్ కోర్టు ఇవ్వాల (ఆదివారం) మధ్యాహ్నం షీజన్ మహ్మద్ ఖాన్‌కు నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకీ అనుమతి ఇచ్చింది. కోర్టులో ఉన్నప్పుడు ఖాన్ తరపు న్యాయవాది శరద్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. “పోలీసులు, కోర్టు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. షీజన్ ఖాన్‌ను కోర్టు హాలులోకి తీసుకొచ్చారు. అతనిపై చేసిన వాదనలు నిరాధారమైనవి” అని తెలిపారు.

- Advertisement -

ఇక.. తునీషా శర్మతో కలిసి నటిస్తున్న రెండో సహనటుడు పార్త్ జుట్షిని ఆదివారం పోలీసులు ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సంప్రదించారు. అయితే.. తునీషా చనిపోయినప్పుడు తాను అక్కడ లేనని, ఈ సమయంలో సెట్స్ కు దూరంగా ఉన్నానని పేర్కొన్న జుట్షి, పోలీస్ స్టేషన్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ “పోలీసులు నన్ను విచారణ కోసం తీసుకువచ్చారు.. కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగారు. ఇది ఆమె వ్యక్తిగత పరిస్థితి కాబట్టి, ఆమె, ఆమె సంబంధాలు ఎలా ఉన్నాయో నేను వ్యాఖ్యానించలేను. అన్నారు.

చిత్రీకరణ సమయంలో టీ విరామం తీసుకున్నప్పుడు, 20 ఏళ్ల తునీషా శర్మ బాత్రూంలో ఉరేసుకుని తాడుకు వేలాడుతూ కనిపించింది.. ఆమె చాలాసేపటి నుంచి బయటకు రాకపోవడంతో అక్కడున్న వారు గమనించి బలవంతంగా తలుపు తెరవవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా, తెల్లవారుజామున 1:30 గంటలకు, షూటింగ్ బృందం ఆమెను ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుందని,ఆమె సహోద్యోగులు చెబుతున్నప్పటికీ, అక్కడికక్కడే పోలీసుల తనిఖీలో సూసైడ్ నోట్ లభించలేదని తేలింది. ఆమె మృతిని హత్య, ఆత్మహత్య కోణంలో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement