Friday, April 26, 2024

బాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు బిక్రమ్ జిత్ మృతి

కరోనా మహమ్మారి బాలీవుడ్ ను కలవరపెడుతోంది. ఇప్పటి కోవిడ్ కారణంగా పలువురు సినీ నటులు మృతి చెందారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్​ ప్రముఖ నటుడు బిక్రమ్ ​జిత్ కన్వర్​పాల్ కొవిడ్​ తో శనివారం ఉదయం మరణించారు. ఆయన వయసు ​52 సంవత్సరాలు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ బిక్రమ్​ జిత్.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు అశోక్ పండిట్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

దాదాపు 18 ఏళ్ల పాటు పలు భాషల్లోని సినిమాల్లో నటించారు.  ఆర్మీ మేజర్​ గా రిటైర్​ అయిన బ్రికమ్​ జిత్.. 2003లో ‘పేజ్ 3’ సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాకెట్ సింగ్, ఆరక్షణ్, మర్డర్ 2, టూ స్టేట్స్, ద ఘాజీ ఎటాక్ తదితర చిత్రాలతో పాటు ఎన్నో టీవీ షోల్లో సహాయ పాత్రలు షోపించి, గుర్తింపు తెచ్చుకున్నారు.

https://twitter.com/ashokepandit/status/1388328529318666247
Advertisement

తాజా వార్తలు

Advertisement