Friday, April 26, 2024

Breaking: సీఎం జగన్ తో నటుడు అలీ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలో సమస్యలు, రాజకీయ అంశాలపై చర్చించే అవకాశముంది. అలీకి రాజ్యసభ స్థానం ఇస్తారనే ప్రచారంలో ఈభేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి మైనారిటీలకు సీఎం జగన్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

గతవారం సినీ ప్రముఖులు ఏపీ సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని, అలీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలో అలీకి త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని సీఎం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వారం తరువాత భేటీ అవుదాం అని అలీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీంతో ఈరోజు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement