Sunday, March 24, 2024

ఆచార్య ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – రూ.33కోట్ల షేర్ వ‌సూల్

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ఆచార్య‌. ఈ చిత్రం ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ రూ..33కోట్ల షేర్ ని వ‌సూలు చేసిన‌ట్టు టాక్. మెగాస్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శాన పాత్ర‌ల‌ని పోషించారు. రామ్ చ‌ర‌ణ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించింది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూసూద్ నటించాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోను తొలి రోజున ఈ సినిమా 33 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. ఒకరకంగా ఇది మంచి వసూళ్లేనని అంటున్నారు. చిరంజీవి – చరణ్ కాంబినేషన్లోని సినిమా కావడం .. కొరటాలకి ఇంతవరకూ ఫ్లాప్ లేకపోవడం ఈ సినిమాపై అంచనాలు పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement