Friday, April 19, 2024

App CMs : నీతి ఆయోగ్ స‌మావేశానికి ఆప్ సీఎంలు దూరం…

రేపు నిర్వ‌హించే నీతి ఆయోగ్ స‌మావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య‌మంత్రులు బ‌హిష్క‌రిస్తున్నారు. ఈసంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయడం, విచ్ఛిన్నం చేయడం, దేశ సహకార సమాఖ్య వాదం కాదని ఆయన లేఖలో వెల్లడించారు.

ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా ప్రభుత్వం విచ్ఛిన్నం కాకపోతే గవర్నర్ ద్వారా పాలనను అడ్డుకునేందుకు ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎందుకు స్తంభింప చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదేనా భారతదేశ విజన్ .? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా అని నిలదీశారు. సహకార సమాఖ్యవాదం ఒక జోక్ గా మిగిలిపోతుందన్న కేజ్రీవాల్.. అందుకే రేపటి నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌వ‌గ‌వంత్ మాన్ లు కూడా నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్క‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement