Thursday, March 28, 2024

ప్రైవేట్ స్కూల్ పై మ‌హిళ కాల్పులు.. ఆరుగురు మృతి

ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆడ్రి హేల్ అనే మ‌హిళ కాల్పుల‌కి తెగ‌బ‌డింది.ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పిల్ల‌లు స‌హా ఆరుగురు మ‌ర‌ణించారు..మ‌రికొంత‌మంది గాయ‌ప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సాయుధురాలైన మహిళపై ఎదురుకా ల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నిందితురాలు ఆడ్రిహేల్ కూడా అక్కడికక్కడే చనిపోయింది. ఇక ఆడ్రి జరిపిన కాల్పుల్లో మృతులను ఎల్విన్ డిక్ఖాస్(9) హాలీ స్క్రగ్స్(9) విలియం కిన్నీ(9) కేథరిన్ కూన్స్(60) సింథియా పీక్(61) మైక్ హిల్(61)గా గుర్తించారు. ఈ మారణహోమం మొత్తం 14 నిమిషాల పాటు సాగింది. నిందితురాలి వద్ద నుంచి రెండు రైఫిల్స్ ఓ హ్యాండ్గన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మారణహోమానికి కారణమైన ఆడ్రిహేల్.. ఈ దారుణానికి పాల్పడక ముందు.. తన మాజీ మిడిల్ స్కూల్ బాస్కెట్ బాల్ సహచరుడు అవెరియాన్నా పాటన్కి మెసేజ్ లు పంపించింది. వీటిలో సూసైడ్ నోట్ కూడా ఉండడం గమనార్హం. ఆమె ఇదే స్కూల్లో చదువుకోవడం గమనార్హం.

ఇక ఈ దారుణానికి ఆమె మానసిక స్థితి సహకరించలేదనే వాదన పోలీసుల నుంచి వినిపించింది. అంతేకాదు.. ఆమె ప్రేమలో విఫలమైనట్టు కూడా తెలుస్తోంది. నేను ఈ రోజు చనిపోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఇది జోక్ కాదు!! నేను చనిపోయిన తర్వాత వార్తల్లో మీరు బహుశా నా గురించి వినే ఉంటారు. ఇది నా చివరి వీడ్కోలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరో జీవితంలో మళ్లీ కలుద్దాం అని ఆడ్రీ హేల్ తన చివరి సందేశంలో పేర్కొంది. నాకు బతకాలని లేదు. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి లేదా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించడం లేదు. నేను చనిపోవాలి.. నేను ఏమి చేయబోతున్నానో నా కుటుంబానికి తెలియదు అని చివరి సందేశాల్లో పేర్కొనడం గమనార్హం. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement