Thursday, April 18, 2024

Karimnagar | స్కూల్ బావిలో చెత్త తీయ‌డానికి దిగి.. నీట మునిగి విద్యార్థి మృతి

తిమ్మాపూర్ (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని సెయింట్ అంథోని హైస్కూల్లో విద్యార్థి బావిలో పడి చ‌నిపోయాడు. ఈ ఘటన మండలంలో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం జ‌రిగింది. ఎల్ఎండీ కాలనీలోని సెయింట్ ఆంథోని స్కూల్లో బావిలో దిగిన 8వ తరగతి విద్యార్థులలో ఒకరు గల్లంతయ్యారు. పెద్దప‌ల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన బాలుడు శ్రీకర్ (14) గా గుర్తుప‌ట్టారు. బావిలో చెత్త తీయడానికి విద్యార్థులు దిగారని స్కూల్స్ సిబ్బంది చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ఈ ఘటనకు కారణమైన వార్డెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వార్డెన్ చెప్పండoతో సెయింట్ ఆంథోని స్కూల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులు బావిలో చెత్త తీయడానికి దిగారు. ఒకరికి ఈత రాకపోవడంతో బావిలోనే మునిగిపోయాడు. బావిలో మునిగిన శ్రీకర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు భావి వద్ద పరిశీలించి ఫైర్ అధికారులను ర‌ప్పించారు. అప్ప‌టికే విద్యార్థి చ‌నిపోయాడు. తిమ్మాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement