Thursday, March 28, 2024

Breaking: హైదరాబాద్​లో రౌడీషీటర్​ దారుణ హత్య.. నడి రోడ్డుపై నరికి చంపేశారు

హైదరాబాద్​ హసన్​ నగర్​లో దారుణం జరిగింది. ఇవ్వాల (బుధవారం) రాత్రి బహదూర్​పురా ఏరియాలోని ఓ హోటల్​ ముందు రౌడీషీటర్​ బాబూఖాన్​ని నరికి చంపేశారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో అటాక్​ చేశారు. దీంతో స్పాట్​లో బాబూఖాన్​ ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి బహదూర్ పురా పోలీసులు చేరుకున్నారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్​కి తరలించారు.

కాగా, బాబూఖాన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్​ ఓపెన్​ అయినట్టు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ మర్డర్​ జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డాగ్​ స్వ్కాడ్​, క్లూస్​ టీమ్​ లను రంగంలోకి దింపారు. మర్డర్​ ప్లేస్​లో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement