Saturday, April 20, 2024

Film Festival: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడించింది. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి (నవంబరు 20) నుంచి ఈ నెల 25 వరకు జరగనుంది. చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా, నిర్మాతగా 150 చిత్రాలకు పైగా పలు సినిమాల్లో నటించారు. విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. అతను హృదయాలను హత్తుకునే అద్భుతమైన ప్రదర్శనలతో తెలుగు సినిమాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందారని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ ట్వీట్​లో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement