Wednesday, April 24, 2024

ముంబైలో కుప్పకూలిన ఫ్లైఓవర్..14 మందికి తీవ్ర గాయాలు

ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్ప కూలింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లైఓవర్‌లోని ఓ భాగం శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో కుప్ప కూలింది. దీంతో 14 మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తలరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement