Thursday, April 18, 2024

Breaking | రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి.. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌

తిమ్మపూర్ (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లాలో ఇవ్వాల సాయంత్రం యాక్సిడెంట్ జ‌రిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ పరిధిలోని సుభాష్ నగర్ kdccb బ్యాంక్ ఎదురుగా బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి సాయిబాబా(19) చ‌నిపోయాడు. ఎల్ఎండీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ కాలనీలోని ఓ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న పొరిక సాయిబాబా (19) సాయంత్రం కళాశాల నుంచి బయటకు వెళ్లాడు. స్థానికంగా తన స్నేహితులను క‌లుసుకునేందుకు వెళ్లాడు. అతను తన బుల్లెట్ పై తిరిగి కరీంనగర్ కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కింద పడిపోయాడు.

ఈ క్ర‌మంలో ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి సాయిబాబాను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సాయిబాబా తలకు తీవ్ర గాయాల‌య్యాయి. తీవ్రంగా రక్తస్రావం అయింది. ఎల్ఎండి ఎస్సై ప్రమోద్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన సాయిబాబాను కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయాడ‌ని పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి గురుమిల్ సింగ్ ఫిర్యాదు మేరకు ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement