Thursday, March 28, 2024

ఆల‌యం షెడ్డుపై కూలిన భారీ చెట్టు… ఏడుగురు మృతి

ఆల‌యం షెడ్డుపై భారీ చెట్టు కూలిపోవ‌డంతో ఏడుగురు మృతిచెంద‌గా, మ‌రో 36మంది తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌ మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్‌ గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్‌ మందిర్‌ సంస్థాన్‌కు చెందిన రేకుల షెడ్డుపై భారీ వేప చెట్టు పడింది. దీంతో షెడ్డుకింద తలదాచుకున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో చెట్టును తొలగించారు. శిథిలాల కింది నుంచి క్షతగాత్రులను బయటకు తీసి దవాఖానకు తరలించారు. మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెట్టు కూలిన ఘటనను జిల్లా కలెక్టర్‌ నిమా అరోరా ధృవీకరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement