Friday, March 29, 2024

బోరుబావిలో బాలుడు.. 9గంట‌లు క‌ష్ట‌ప‌డినా ద‌క్కని ప్రాణం

ఐదేళ్ల బాలుడు బోరుబావిలో ప‌డిపోయాడు..దాంతో ఆ బాలుడిని సజీవంగా బయటకు తీయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానికు పోలీసులు సంయుక్తంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. తొమ్మిది గంటలపాటు కష్టపడ్డా ఆ బాలుడి ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌‌లోని బుర్హన్‌పూర్‌కు చెందిన కుటుంబం మహారాష్ట్రకు వలస వచ్చింది. చెరుకు సాగు చేసే రైతు కొడుకే మృతి చెందిన ఐదేళ్ల సాగర్ బరేలా. కర్జత్ తహశీలులోని కొపర్దీ గ్రామంలో వారు నివసిస్తున్నారు.ఆ బాలుడిని పొలం నుంచి ఇంటికి ఎడ్ల బండిపై వెళ్లారు. ఎడ్ల బండి దిగిన తర్వాత కొంత సేపటికే సాగర్ బరేలా పాడుబడ్డ బోరుబావిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు.బాలుడు మరణించడం బాధాకరమని కర్జత్ జంఖేడ్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. శాయశక్తుల ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement