Friday, April 19, 2024

చ‌నిపోయిన‌ తండ్రి బతికొస్తాడని.. చిన్నారి మగ బిడ్డను బలి ఇచ్చేందుకు య‌త్నం

మూఢ న‌మ్మ‌కం అంటే మామూలుగా ఉండ‌దు.. మొన్న‌టికి మొన్న కేర‌ళ‌లో మ‌నుషుల‌ను చంపి కూర వండుకుని తిన్న ఘ‌ట‌న జ‌నాలు ఇంకా మ‌రిచిపోనేలేదు.. ఇంత‌లో మ‌రో ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓ యువ‌తి త‌న తండ్రి బ‌తికొస్తాడ‌న్న న‌మ్మ‌కంతో ఓ మ‌గ బిడ్డ‌ను బ‌లి ఇవ్వ‌డానిడానికి య‌త్నించింది. ఈ ఘ‌ట‌న మ‌రెక్క‌డో మారుమూల ప్రాంతంలో కాదు.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది. శ్వేత (25) అనే యువతి ఈ మ‌ధ్య‌నే త‌న‌ తండ్రిని కోల్పోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆమె తండ్రి చ‌నిపోయాడు. తాంత్రిక శక్తులపై నమ్మకం ఉన్న శ్వేత… చనిపోయిన తన తండ్రిని బతికించుకునేందుకు ఓ క్షుద్ర పూజారిని ఆశ్రయించింది. అతడు చెప్పిన సలహాతో మ‌గ బిడ్డ‌ను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అయితే.. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్ప‌త్రికి వెళ్లిన శ్వేత, అక్కడ ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకుని ఆమె కుటుంబంతో పరిచయం పెంచుకుంది. తనను వారు న‌మ్మిన‌ట్టు నిర్ధారించుకున్నాక తన ప్లాన్ ను అమలులో పెట్టింది. పిల్లవాడిని మళ్లీ తీసుకొస్తాన‌ని చెప్పి అక్క‌డి నుంచి తీసుకెళ్లింది. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఆ శిశువు తల్లి ఈమెను పూర్తిగా న‌మ్మ‌లేదు. తనతో పాటు త‌న‌ మేనకోడలు రీతూను కూడా పంపించింది.

కాగా, దారి మ‌ధ్య‌లో రీతూకు శ్వేత ఓ కూల్ డ్రింక్ ఇవ్వగా అది తాగిన ఆ పిల్ల‌ స్పృహ కోల్పోయింది. ఆ త‌ర్వాత‌ మగశిశువుతో శ్వేత కారులో వెళ్లిపోయింది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన రీతూ… జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత శ్వేతను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందుకోసం 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. మొబైల్ ట్రేస్ టెక్నాలజీని వినియోగించారు. ఎట్టకేలకు శ్వేతను అరెస్ట్ చేసి శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ చిన్నారి క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement